గజ్వేల్ జులై 01. కొండ పోచమ్మ సాగర్ కాలువ లీకేజీ పై కాంగ్రెస్స్, బీజేపీలు గోబెల్స్ ప్రచారం చేశారు. చిన్న కాలువ తెగితే పెద్ద రాదత్తం చేస్తున్నారు.. కోడి గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నాయి ప్రతిపక్షాలని మంత్రి హరీష్ రావు విమర్శించారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ ప్రంపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ కాళేశ్వరం లిఫ్ట్. కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులు సైతం కొట్టుకుపోయిన విషయం మరిచిపోయి మాట్లాడం విడ్డురంగా ఉంది. - ఎస్సారెస్పీ ఓపెన్ చేసినప్పుడు కూడా 131,118 కిలోమీటర్ల వద్ద కాలువ బ్రీచ్ అయ్యిందని అయన అన్నారు. ఖమ్మం జిల్లాలో పాలెం వాగు ప్రాజెక్టు 04, 07,2007 వ రోజు కొట్టుకుపోయింది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ రెడీ కాకముందే కొట్టుకొనిపోయింది. దాని నిర్మణంలో లోపం ఉందని అప్పటి కాంగ్రెస్స్ వారు దాన్ని వదిలేశారు. దేవాదుల ప్రాజెక్ట్ పైపులు పటాకుల లాగా పేలిపోయాయి... అప్పుడు మంత్రులుగా ఉత్తమ్, పొన్నాల ఉన్నారు. గుజరాత్ లోని సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ కాలువలకు కూడా 200 సార్లు గండి పడింది. ఇటీవలే మనోహరబాద్ లో కురిసిన వర్షానికి రైల్వే లైన్ తెగి కొట్టుకొనిపోయింది.. దీనికి కారణం ప్రధానమంత్రి అని మేము అంటే బీజేపీ నాయకులు ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో నీరు,కరెంట్ ఇవ్వకుండా రైతులను గోస పెట్టారు. అసాధ్యం అనుకున్న గోదావరి నీటిని తెచ్చి రైతులకు అందించిన ఘనత కేసీఆర్ కె దక్కింది. కాంగ్రెస్ పార్టీ అంటే గ్లోబల్స్ పార్టీ అని ముద్ర పడింది. దీని వల్లే ప్రతి పక్ష హోదా కూడా కోల్పోయిందని మంత్రి అన్నారు..
కరీంనగర్ లో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా చెరువులు నింపినాం. కొండపోచమ్మ సాగర్ కు వచ్చిన కాంగ్రెస్స్, బీజేపీ వారు.. ఆ నీరు నేతి మీద నీళ్లు పోసుకుని... చేసిన తప్పులను ఒప్పుకొని కొండపోచమ్మకు దండం పెట్టండి. సలహాలు ఉంటే ఇవ్వండి.. కానీ బురద చల్లి పోవాలని చూస్తే ఒప్పుకొమని అన్నారు. రెండు రోజుల్లో పనులు పూర్తి అవుతాయి... యధావిధిగా నీరు వస్తాయని అయన అన్నారు.