హైదరాబాద్ జులై 01. ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు 72 వ జన్మదినాన్ని పురస్కరించుకొని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ శుభాకాంక్షలు తెలిపారు. రైతు కుటుంబంనుండి వచ్చి భారత దేశ ఉన్నత రాజ్యాంగ పదవినలంకరించి ఆ పదవికి వన్నె తెచ్చారని అన్నారు. మీ వ్యక్తిత్వం, అలుపెరుగని నిరంతర కృషి, పట్టుదల, సేవా గుణం తనలాంటి భారతీయులందరికో ప్రేరేపితులైనారని, నైతిక విలువలకు ప్రాధాన్యమిచ్చి దేశ అభ్యున్నతికి మీరు తీసుకున్న కార్యక్రమాలు ఎల్లవేళలా ప్రజల మనస్సులో గుర్తుండిపోతారని పేర్కొన్నారు.దేశ సేవలో మీరు మరింత చురుకుగా కృషిచేయడానికి మీకు ఆయు రారోగ్యాలు మరియు దీర్గాయుష్షు ను ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు బండారు దత్తాత్రేయ వెంకయ్య నాయుడు తెలిపారు.