YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

వెండి ధరలు పరుగో... పరుగు

వెండి ధరలు పరుగో... పరుగు

ముంబై, జూలై 2, బంగారం ధర తగ్గుదల ఒక్క రోజు ముచ్చటే అయ్యింది. పసిడి మళ్లీ పరుగులు పెట్టింది. బంగారం ధర భారీగా పెరిగింది. పసిడి ధర ర్యాలీ చేస్తే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ఇంకా ఎక్కువగానే పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర తగ్గినా కూడా దేశీ మార్కెట్‌లో బంగారం ధర పైకి కదలడం గమనార్హం.హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర భారీగా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.470 పరుగులు పెట్టింది. దీంతో ధర రూ.46,740కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా పైకి కదిలింది. 10 గ్రాముల బంగారం ధర రూ.470 పెరుగుదలతో రూ.50,950కు ఎగసింది. బంగారానికి ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి.పసిడి ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1500 పెరిగింది. దీంతో ధర రూ.50,050కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. దీంతో బంగారం, వెండి ధరలు రూ.అర లక్ష దాటాయని చెప్పుకోవచ్చు.ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర దిగొచ్చింది. పసిడి ధర ఔన్స్‌కు 1.20 శాతం తగ్గింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1779 డాలర్లకు పడిపోయింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 1.95 శాతం తగ్గుదలతో 18.27 డాలర్లకు క్షీణించింది.దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర భారీగా పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 ర్యాలీ చేసింది. దీంతో ధర రూ.47,550కు ఎగసింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా పెరిగింది. రూ.450 పెరుగుదలతో రూ.48,750కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర కూడా రూ.1500 పెరిగింది. రూ.50,050కు చేరింది.ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Related Posts