YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కరోనాను లైట్ గా తీసుకుంటున్న జనం

కరోనాను లైట్ గా తీసుకుంటున్న జనం

సెంట్రల్ వర్శటీ అధ్యయనం
హైద్రాబాద్, జూలై 2, కరోనా వైరస్ మానవాళిని పట్టి పీడిస్తున్న వేళ దీని గురించి ప్రజల్లో ఏ మేరకు అవగాహన ఉందనే అంశంపై ఓ పరిశోధన జరిగింది. హైదరాబాద్ విశ్వవిద్యాలయం చేసిన ఈ పరిశీలనలో ఆశ్చర్యకర ఫలితాలు వెలుగు చూశాయి. గ్రామీణ ప్రాంత ప్రజల్లో కరోనా వైరస్‌పై అవగాహన అట్టడుగు స్థాయిలో ఉన్నట్లుగా బయటపడింది. ఈ అధ్యయనంలో భాగంగా 36 మంది క్షేత్ర స్థాయి పరిశీలకులు పని చేశారు. వీరికి మరో ఆరుగురు విశ్వవిద్యాలయ ఫ్యాకల్టీ దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌ను ఆనుకొని ఉండే జిల్లాలైన సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని పల్లెటూర్లలో క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టారు. తెల్లాపూర్, ఉస్మాన్ నగర్, కొల్లూరు, వేల్ముల, వట్టినాగుల పల్లి గ్రామాల్లో పరిశీలకులు 342 ఇళ్లకు వెళ్లి నేరుగా సర్వే నిర్వహించారు.గత నెల 20న కరోనాకు సంబంధించి ఐదు ముఖ్యమైన అంశాలపై సర్వే చేసి, దాని ఫలితాలను నమోదు చేసుకున్నారు. కొవిడ్-19, దాని వల్లే కలిగే నష్టాలు, ఆదాయం, ఉపాధి, సామాజిక ప్రభావం, ఆరోగ్యం వంటి అంశాలను ప్రజల వద్ద ప్రస్తావించి వారి స్పందనలను నమోదు చేసుకున్నారు. అధ్యయనంలో భాగంగా వివిధ వర్గాలకు చెందిన ప్రజలను అడిగి తెలుసుకున్నారు.‘‘బాగా చదువుకున్న వారిలో కొవిడ్, దాని వల్ల ఎదురయ్యే పరిణామాల పట్ల అవగాహన బాగానే ఉంది. కానీ వైరస్ వల్ల ఎదురయ్యే తీవ్రమైన పరిణామాలు వారిని కొవిడ్ నిబంధనలు పాటించేలా ప్రభావితం చేయలేకపోతున్నాయి. కరోనా సంక్రమించే విధానం, వ్యాప్తి, నియంత్రణ, రోగనిరోధకశక్తి పెంచుకోవడం తదితర అంశాలపై మంచి అవగాహన ఉంది. కానీ, కరోనా వల్ల ఇటీవల వెలుగు చేసిన కొత్త లక్షణాలు తదితర అంశాలపై అంతగా అవగాహన లేదు. మూఢ నమ్మకాల వంటివి కొందరిలో ఎక్కువగా ఉన్నాయి.’’ అని అధ్యయనం వెల్లడించింది.అయితే, ఈ అధ్యయనాన్ని కనీసం ఆరు నెలలపాటు కొనసాగించేందుకు హైదరాబాద్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ అప్పారావు అనుమతి ఇస్తామని వెల్లడించారు. తద్వారా కొవిడ్‌కు ముందు, వైరస్‌ ప్రబలుతున్న సమయంలో, వైరస్ నియంత్రణ అయ్యాక గ్రామీణ ప్రజలు సామాజికపరంగా, ఆరోగ్యఅలవాట్లలో వచ్చే మార్పులను గుర్తించవచ్చని వివరించారు.

Related Posts