YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

మిడతల దండు...ప్రమాదం ఇంకా ఉంది

మిడతల దండు...ప్రమాదం ఇంకా ఉంది

హైద్రాబాద్, జూలై 2, రాష్ట్రంలోకి ఏ సమయంలోనైనా మిడతల దండు ప్రవేశించే అవకాశం ఉన్నందున వాటిని చంపేందుకు ప్రభుత్వం ముందస్తు వ్యూహాలను రచిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న మిడతల నిరోధక చర్యలపై దృష్టిసారించింది. ప్ర స్తుతం మహారాష్ట్రలోనే ఉన్న మిడతల దండు రాష్ట్రంలోకి వచ్చేందుకు అవకాశాలు అలాగే ఉన్నందున, తగిన జాగ్రత్తలపై ప్రణాళికలు సిద్ధం చేశారు. 9 జిల్లాల కలెక్టర్లకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.రసాయనాల కొనుగోలుకు, పిపిఇ కిట్లకు రూ.5. 95 లక్షల చొప్పున తొమ్మిది జిల్లాలకు రూ.53. 55 లక్షల విపత్తు నిర్వహణ నుంచి వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి బి. జనార్ధన్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఇటీవల వ్యవసాయ, అటవీ, పోలీసు ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మిడతల దండును ఎదుర్కొవడంపై సుధీర్ఘంగా చర్చించారు. జిల్లా కలెక్టర్లకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎటువంటి చర్యలకు ఉపక్రమించాలో తాజాగా ఆదేశాలు జారీ చేశారు. సాధారణంగా మిడతల దండు ఉదయం వేళప్రయాణం చేస్తుంటోంది. ఈ సమయంలో వీటిని చంపడం అంత సులువు కాదు. దీంతో మిడతలు చెట్లపై, చేనుపై వాలినపుడే చంపేందుకు సులువవుతోంది. దీంతో రాత్రివేళ, వేకువ జామున మిడతలను చంపేందుకు సిద్దపడాలని, అందుకు అవసరమైన సామాగ్రిని సిద్దంగా పెట్టుకోవాలని సిఎస్ కలెక్టర్లకు ఆదేశించారు. ముందుగా రాష్ట్రంలోకి మిడతల దండు ప్రవేశించే సరిహద్దు జిల్లాలను గుర్తించాలి. అన్ని గ్రామాలలోనూ మిడతలు ప్రవేశించి మార్గాలను గుర్తించి, అక్కడి ప్రజలకు ముందస్తుగా మిడతలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి జిల్లాకు 500 లీటర్ల చొప్పున రసాయనాలను సిద్ధంగా పెట్టుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. రంగు కలిపిన నీటితో గ్రామాల్లో స్ప్రే మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు. వీటన్నింటిపై వ్యవసాయ శాఖ త్వరలోనే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్స్ విడుదల చేయనుంది.జిల్లా కలెక్టర్, కమిషనర్ ఆఫ్ పోలీసు లేదా ఎస్‌పి, జిల్లా అటవీ అధికారి, జిల్లా వ్యవసాయాధికారి, జిల్లా ఫైర్ అధికారి, డిపిఒ, ఇతర స్టేక్ హోల్డర్స్‌తో పాటు జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నుంచి ప్రతి జిల్లాకు కీటక శాస్త్రవేత్తతో కలిపి జిల్లా స్థాయి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ మిడతల దాడి జరిగే అన్ని మండలాలు, సరిహద్దు గ్రామాలలో గ్రామ కమిటీలను గుర్తించాలి. ప్రభుత్వ సిబ్బందితో పాటు ప్రభుత్వ సంస్థలు, సంఘాలు, సమూహాలు, స్వచ్ఛంధ సంస్థలను భాగస్వామ్యం చేయాలి. గ్రామంలో అందుబాటులో ఉన్న ట్రాక్టర్లు, ట్యాంకర్లు, ఇతర వాహనాలు, స్ప్రేయింగ్ పరికరాలు, పిపిఒ కిట్లతో పాటు స్థానికంగా అందుబాటులో ఉన్న అన్ని యంత్రాలతో జాబితా ఉండాలి. జిల్లాలు, మండల కేంద్రాలలో జెట్టింగ్ యంత్రం కూడా ఉండాలి.మిడతలు ప్రవేశించే స్థలాలను గుర్తించి, వాటిని చంపేందుకు స్ప్రే చేయడానికి తగిన స్థలాన్ని గుర్తించాలి. ఇక్కడకు భారీ వాహనాలు వెళ్లేందుకు అనుకూలంగా ఉండాలి. ఫైరింజన్‌లు వచ్చేందుకు ప్రతిక్షణం సిద్ధంగా ఉండాలి. రాత్రివేళ పిచికారీ చేయాల్సి ఉన్నందున లైటింగ్ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి.రసాయనాలు స్ప్రే చేసే సమయంలో ఖచ్చితంగా నీటి అవసరం ఉంటుంది. మిడతలను నాశనం చేసే ప్రదేశంలో నీటి కుంటలు, ఇతర నీటి వనరులు దగ్గరలో ఉండేలా చూడాలి. ప్రమాదకరమైన రసాయనాలు స్ప్రే చేస్తున్నందున పిపిఇ కిట్లు ధరించాల్సి ఉంటుంది. పంటలకు, పశుపక్షాదులకు ఆరోగ్య, ప్రాణ నష్టం లేకుం డా జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలి.మొక్కల నర్సరీలకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వేప పూత ముందుగా చల్లుకోవడం మంచింది. అటవీ ప్రాంతం అయితే సెల్‌ఫోన్ సిగ్నల్స్ సమస్య వచ్చే అవకాశం ఉన్నందున కమ్యూనికేషన్ సెట్ వినియోగించాల్సి ఉంటుంది.

Related Posts