నందవరం జూలై 2, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే గ్రామ సచివాలయాల వ్యవస్థను రూపొందించింది. దీని ద్వారా ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలు, ధ్రువీకరణ పత్రాలను అన్ని రకాల సేవలను అందించేందుకు ఏర్పాటు చేశారు. గ్రామంలోని రెండు వేల జనాభాకు ఒక సచివాలయం పేరిట అన్ని గ్రామాల్లో సచివాలయాల ను ఏర్పాటు చేసి వాటికి వేసిన రంగులు రంగులు అధికార పార్టీ రంగులుగా కనబడేలా ఉన్నాయని ప్రతిపక్ష తెదేపా ఆరోపించడం, వారి మద్దతుతో హైకోర్టు, సుప్రీంకోర్టులో ప్రజా వాజాల నమోదయ్యాయి. నాయ స్థానాలు రంగులను మార్చాలని ఆదేశాలు జారీ చేసింది. గురువారం నందవరం మండలంలోని ఆయా గ్రామాల్లో సచివాలయాలకు వేసిన రంగులను అధికారులు మార్చేశారు