YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

భాస్కర్ రావు హత్య కేసులో నిందితుల ఆరెస్టు

భాస్కర్ రావు హత్య కేసులో నిందితుల ఆరెస్టు

మచిలీపట్నం జూలై 2 , వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకుడు, కృష్ణాజిల్లా మచిలీపట్నం మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మోకా భాస్కరరావు దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడు, టీడీపీ నేత చింతా చిన్నితో పాటు మరో ఇద్దరు అనుమానితులను ఆర్‌పేట పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాజకీయ ఆధిపత్యం చాటేందుకే భాస్కర రావును హత్య చేసినట్లు పోలీసుల విచారణ  నిర్ధారణ అయ్యింది. దీనిపై మరికొందరిని సైతం విచారించే అవకాశం ఉంది. భాస్కర్‌రావు హత్య రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.గతనెల 29న బందరు నడిబొడ్డున అందరూ చూస్తుండగా పట్టపగలు ఈ హత్య జరగడం తీవ్ర కలకలం రేపింది. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే ఆయన అనుచరుడు చింతా చిన్ని పక్కా పథకం ప్రకారం ఈ హత్యకు పాల్పడినట్టుగా భాస్కరరావు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా హత్యతో ఈ ముగ్గురికి సంబంధం ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. రాష్ట్ర రవాణా సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య కు మోకా భాస్కరరావు ముఖ్య అనుచరుడు.

Related Posts