YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కొల్లు రవీంద్రను ఆరెస్టు చేయాలని అందోళన

కొల్లు రవీంద్రను ఆరెస్టు చేయాలని అందోళన

మచిలీపట్నం జూలై 3,  కృష్ణాజిల్లా మచిలీపట్నంలో వైసీపీ నేత భాస్కర్ రావు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను అరెస్ట్ చేయాలని ధర్నాకు దిగిన మోకా భాస్కరరావు బంధువులు, మత్స్యకారులు, అభిమానులు ధర్నాకు దిగారు. కొల్లు రవీంద్ర కుల ద్రోహి, కుల బహిష్కరణ చేయాలంటూ నినాదాలు చేసారు. వెంటనే అరెష్టు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మచిలీపట్నంలో పోలీసులు భారీగా మోహరించారు. కాగా మచిలీపట్నం వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసు కీలక మలుపు తిరిగింది. గత నెల 29న బందరులో భాస్కరరావు దారుణ హత్యకు గురయ్యారు. చేపల మార్కెట్‌ వద్ద ఓ యువకుడు కత్తితో పొడవడంతో దీంతో అతన్ని ఆస్పత్రి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా ఘటనా స్థలం నుంచి మరో యువకుడి సాయంతో నిందితుడు బైక్ ఎక్కి పరైనట్టు గుర్తించారు పోలీసులు. మోకా హత్య కేసుకు సంబంధించి ఇంత వరకూ ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు. మోకాను హత్య చేస్తే... ఆ తర్వాత అంతా తాను చూసుకుంటానని కొల్లు రవీంద్ర అభయం ఇచ్చారంటూ నిందితులు వాంగ్మూలం ఇవ్వడంతో కుట్రదారుగా కొల్లు రవీంద్రపై 109 సెక్షన్ కింద ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు.

Related Posts