కమాన్ పూర్ జూలై 3 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచన భావితరాలకు ఎంతో ఉపయోగపడుతుందని జడ్పీ చైర్మన్ పుట్టమధు అన్నారు. శుక్రవారం కమాన్ పూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో రామగుండం సి పి సత్యనారాయణతో కలిసి హరితహారం లో మొక్కలను నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల కాలుష్యం నివారించిన వారవుతారని అన్నారు. హరితహారం ఒక ఉద్యమంలా చేపట్టాలని స్పష్టం చేశారు. అటవీ సంపదను కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని నేటి మొక్కలు రేపటి వృక్షాలు అని పేర్కొన్నారు.
ఎంతో మంది పోలీస్ అమరవీరుల ప్రాణాల త్యాగం వలన ఈ ప్రాంతంలో ప్రజలు సుఖసంతోషాలతో ఆనందంగా జీవిస్తున్నారు కానీ మనకోసం కష్టపడే పోలీస్ వారికీ ఆనందమైన జీవితం లేదన్నారు. సిసి కెమెరాల ఏర్పాటు వలన నేరాలు చేయడానికి నేరస్థులు భయపడతారు అన్నారు. దాతల సహాయం తో సిసి కెమెరాలు ఏర్పాటు చేసిన ఎస్ఐ కమాన్ పూర్ గారిని అభినందించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో హరిత హారంలో భాగంగా సీపి, జడ్పి చైర్మన్ పుట్ట మధు, డీసీపీ పెద్దపల్లి రవీందర్, ఏఆర్ అడిషనల్ డీసీపీ సంజయ్. ఏసీపీ గోదావరిఖని ఉమేందర్, సీఐ గోదావరిఖని 2 టౌన్ శ్రీనివాస్ రావు ఎస్సై శాం పటేల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు రు ఇతర పోలీస్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు.