సూళ్లూరుపేట జులై 04
ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 88 వ పుట్టిన రోజు వేడుకలు వారి గృహం లో ఘనం గా జరిగాయి . ఈ సందర్భం గా వేదపండితులు ఆశీర్వాదము లతో మిత్రులు కె . వి . చలమయ్య జొన్నవాడ కామాక్షమ్మ అమ్మవారు , శ్రీ తల్పగిరి రంగనాథస్వామి , శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి మరియు సూళ్ళూరుపేట చెంగాళమ్మపరమేశ్వరి వార్ల తీర్థ ప్రసాదములు ఇచ్చి కొణిజేటి రోశయ్యను శాలువ తో సత్కరించి సన్మానం చేయడం జరిగింది . ఈ సందర్భం గా కె.వి. చలమయ్య మాట్లాడుతూ "ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా , తమిళనాడు రాష్ట్ర గవర్నర్ గా మరియు అనేక ఉన్నత పదవులను అలకరించి వివాద రహితుడు గా పేరు ప్రఖ్యాతలు పొందినారని" అన్నారు . కోవిడ్ - 19 వలన ఎక్కువ మంది తో కాక పోయినా కుటుంబ సభ్యులు మరియు కొంత మంది మిత్రులతో మాత్రమే పుట్టిన రోజు ను రోశయ్య సంతోషము గా జరుపుకున్నారు అని సమాచారం .