YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైకాపా తీర్థం పుచ్చుకున్న టిడిపి సీనియర్ నాయకులు

వైకాపా తీర్థం పుచ్చుకున్న  టిడిపి సీనియర్ నాయకులు

నెల్లూరు జూలై 6, 
 నెల్లూరు గ్రామీణ నియోజవర్గ పరిధిలోని కొత్త వెల్లంటి మరియు గొల్లకందుకూరు గ్రామాలకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బిజ్జం సీతారామిరెడ్డి, కట్టా ధర్మయ్య యాదవ్, పొనకా హరి ప్రసాద్ రెడ్డి  మరియు వీరి మిత్రబృందం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు గ్రామీణ నియోజవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ   వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో కష్టం చేసే ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకుడికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. కొత్త పాతల కలయికతో నెల్లూరు గ్రామీణ నియోజవర్గ లో వైకాపాకు తిరుగు లేదు అనే విధంగా వైకాపా జెండాను నిలపడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త తమ విధి నిర్వహణ కొనసాగించాలని పిలుపునిచ్చారు.  క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులు బలంగా మరియు సంతోషంగా ఉంటేనే ఏపార్టీకైనా మనుగడ ఉంటుందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.  దేశచరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో మొదటి సంవత్సరంలోనే 90% హామీలు నెరవేర్చిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఈ సేవలు అందిస్తున్నారని ప్రభుత్వ సేవలు కొనియాడారు. నూతనంగా పార్టీలో చేరి వారందరికీ పార్టీలో ప్రాముఖ్యత కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ ఇన్చార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, కొత్త వెల్లంటి మరియు గొల్ల కందుకూరు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts