YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ముగ్గురు తాగుబోతు పోలీసుల సస్పెన్షన్

ముగ్గురు తాగుబోతు పోలీసుల సస్పెన్షన్

అనంతపురం జూలై6  
హిందూపురం టూటౌన్ పోలీసుస్టేషన్ రెస్ట్ రూంలో పోలీసు సిబ్బంది మద్యం సేవించిన ఘటనను జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు సీరియస్ గా పరిగణించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు సిబ్బందిపై వేటు వేశారు. హిందూపురం టూటౌన్ హెడ్ కానిస్టేబుళ్లు తిరుమలేష్ , నూర్ మహమ్మద్ , కానిస్టేబుల్  గోపాల్ నాయక్ లను సస్పెండ్ చేస్తూ ఎస్పీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ముగ్గురు కూడా హిందూపురం టూటౌన్ లో పని చేస్తున్నారు. తిరుమలేష్ , నూర్ మహమ్మద్ ల కుటుంబాలు అనంతపురంలో ఉంటున్నాయి. గోపాల్ నాయక్ అవివాహితుడు. దీంతో ఈ ముగ్గురు డ్యూటీకి వచ్చిన సదర్భాలలో టూటౌన్ పోలీసు స్టేషన్ పైభాగంలో ఉన్న రెస్ట్ రూంలో బస చేసేవారు. ఈక్రమంలో ఈ ముగ్గురు కలసి రెస్ట్ రూంలో ఉన్న సమయంలో మద్యం సేవించారు. ఈఘటనపై ప్రాథమిక విచారన జరిపించి ఈ ముగ్గుర్ని సస్పెండ్ చేశారు.

Related Posts