YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

దొంగ ఈ పాస్ లతో జరభద్రం

దొంగ ఈ పాస్ లతో జరభద్రం

విజయవాడ, జూలై 7, 
హైదరాబాద్ లాక్‌డౌన్ ప్రచారం, కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణతో పాటూ ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి జనాలు క్యూ కడుతున్నారు. కేంద్రం లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చినా జగన్ సర్కార్ మాత్రం రాష్ట్రానికి రావాలంటే పాస్ ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. స్పందన యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. అది కూడా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకే సరిహద్దులో చెక్‌పోస్టు దగ్గర అనుమతిస్తున్నారు. దీంతో పాస్‌ల కోసం జనాల దరఖాస్తుల వెల్లువలా వస్తున్నాయి.ఈ ఈ-పాస్‌‌ల పేరుతో కొందరు జనాలకు టోపీ పెడుతున్నారు కొందరు కేటుగాళ్లు. ఇలా ఓ కేటుగాడు ఏకంగా 73మందిని మోసం చేశాడు. పాస్‌ల పేరుతో బురిడీ కొట్టించాడు. ప్రకాశం జిల్లాకు చెందిన మందా పవన్ కుమార్ హైదరాబాద్ ఉప్పల్‌లో ఓ కన్సల్టెన్సీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తెలంగాణ నుంచి ఆంధ్రాకు వచ్చేందుకు డీజీపీ ఆఫీస్ నుండి ఈపాస్‌లు జారీ చేస్తుంటారు. పవన్ కుమార్ ఈ పాస్‌ల పేరుతో నకిలీ ఈపాస్‌లను సృష్టించాడు. అమాయకుల నుంచి డబ్బు వసూలు చేశాడు.నెల్లూరు, ప్రకాశం జిల్లాకు చెందిన 73 మందికి అమాయకులకు ఫేక్ ఈ పాస్‌లను తయారు చేసి ఇచ్చాడు. మోసపోయినవారి ద్వారా ఈ విషయం కృష్ణాజిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబుకి తెలిసింది. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకునేందుకు స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేసి.. డేకాయ్ ఆపరేషన్ ద్వారా ఎర వేసి పట్టుకున్నారు. పాస్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.. ఎవరైనా సరే స్పందన యాప్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని.. ఇలాంటి మాయగాళ్ల మాయలో పడొద్దంటున్నారు.

Related Posts