YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సచివాలయ కూల్చివేత షురూ

సచివాలయ కూల్చివేత షురూ

హైద్రాబాద్, జూలై 7, 
హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనం కూల్చివేత ప్రక్రియ మొదలైంది. ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో సోమవారం అర్ధరాత్రి నుంచే భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేత పనులు ప్రారంభించారు. సచివాలయం వైపు వెళ్లే మార్గాలను మూసివేశారు. ముందస్తు జాగ్రత్తగా భారీగా పోలీసుల్ని మోహరించారు. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న సచివాలయ భవనం ఇక కనమరుగుకానుంది. త్వరలోనే కొత్త సచివాలయ నిర్మాణం ప్రారంభంకానుంది.. ఆ దిశగా కేసీఆర్ సర్కార్ అడగులు వేస్తోంది. ఇప్పటికే సెక్రటేరియట్‌లో ఉన్న అన్ని శాఖల్ని ఇతర భవనాల్లోకి మార్చేసిన సంగతి తెలిసిందే.తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయం నిర్మించాలని నిర్ణయించింది.. కేబినెట్‌లో కూడా తీర్మానం చేశారు. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియెట్‌ను కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే తెలంగాణ సచివాలయం కూల్చివేత, కొత్త సచివాలయం నిర్మాణంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారని.. పదుల సంఖ్యలో పిటిషన్లు రావడంతో విచారణ జరిపిన కోర్టు వాదనల్ని సుదీర్ఘంగా వినింది. ప్రస్తుతం ఉన్న సచివాలయం ఇప్పుడు ఉన్న అవసరాలకు సరిపోవడం లేదని ప్రభుత్వం కూడా తమ వాదనలు వినిపించింది. అందరి వాదనలు విన్న కోర్టు కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Related Posts