YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు

చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు

విశాఖపట్నం జూలై 7, 
ప్రజలపై కక్షపెట్టి ఇళ్ల పట్టాలను అడ్డుకోవడం  చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పరాకాష్టగా మారిందని మంత్రి అవంతి శ్రీనివాస్ రావు చెప్పారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రజలకు ఇళ్లు పట్టాలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే చంద్రబాబు వ్యవస్ధలతో పట్టాలను అందించే కార్యక్రమాన్ని అడ్డుకోనే కుట్ర చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య అంటూ ఎద్దేవ చేశారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్లు పట్టాలు ఇస్తామని చెబితే నిరసన వ్యక్తం చేస్తున్నారని, గతంలో చంద్రబాబు కట్టించిన ఇళ్లకు పెట్టిన బకాయిలను ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం తీరుస్తోందని చెప్పారు. ప్రజలు ఇవన్నీ గమనించే 23 సీట్లును ఇచ్చారని అది కూడా విశాఖ ప్రజలు ఇచ్చిన నాలుగు స్ధానాలతో చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా దక్కిందని చెప్పారు. గత ఎన్నికల్లో ఓడించిన ప్రజలపై కక్షకట్టి దిగజారుడు రాజకీయాలకు చంద్రబాబు పాల్పడుతున్నారని ఆరోపించిన ఆయన, ఇళ్ల పట్టాల విషయంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న టిడిపి దాన్ని నిరూపించాలని ఈ సందర్బంగా మంత్రి అవంతి శ్రీనివాస్ రావు చంద్రబాబును నిలదీశారు. పట్టాలకు అర్హులను ఎంపిక చెయ్యడంలో సిఎం జగన్ అధికారులకు పూర్తి స్ధాయిలో స్వేచ్చను ఇచ్చారని చెప్పారు. ఎక్కడా కూడా పట్టాల ఎంపిక అంశంలో జోక్యం చేసుకోదని మంత్రి అవంతి శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు.

Related Posts