YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

సోయా రైతులు జెడిఏ కార్యాలయం ఎదుట ధర్నా

సోయా రైతులు జెడిఏ కార్యాలయం ఎదుట ధర్నా

ఆదిలాబాద్ జూలై 07             
జిల్లాలో సోయ పంట వేసి మొలకెత్తక నష్టపోయిన రైతులు మంగళవారం జెడిఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రైతులకు మద్దతుగా బిజెపి జిల్లా అధ్యక్షులు పాయల్  శంకర్  సంఘీభావం తెలపడం జరిగింది పాయల్  శంకర్  మాట్లాడుతూ దాదాపుగా ఇరవై రోజుల నుంచి రైతులు  జెడిఏ కార్యాలయ చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదన్నారు ఏదైతే డూప్లికేట్ సోయా విత్తనాలు సరఫరా చేసిన కాంట్రాక్ట్ డీలర్ పై కేసు పెట్టాలని అదేవిధంగా రైతులను ఆదుకోవాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా రైతులు పాల్గొన్నారు ఇంచార్జ్ జెడ్ఏ  వెంకట్ మాట్లాడుతూ 5 రోజులలో రైతులకు డబ్బులు ఇచ్చే విధంగా చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.

Related Posts