YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

'ఇండియన్ ఒసామా బిన్ లాడెన్‌' అరెస్ట్

'ఇండియన్ ఒసామా బిన్ లాడెన్‌' అరెస్ట్

వాంటెడ్ టెర్రరిస్ట్ అబ్దుల్ సుభాష్ ఖురేషి 

మోస్ట్ వాంటెడ్ ఇండియన్ ముజాహిద్దీన్ టెర్రరిస్ట్‌ అబ్దుల్ సుభాష్ ఖురేషి అలియాస్ తౌఖీర్‌ను సోమవారం ఉదయం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 'ఇండియన్ ఒసామా బిన్ లాడెన్‌'గా పిలవబడే ఖురేషి 2008 సంవత్సరంలో గుజరాత్ జరిగిన వరుస ఉగ్రదాడుల్లో నిందితుడు. అంతేకాకుండా 2006లో ముంబైలో జరిగిన రైలు దాడి ఘటనలో కూడా ఇతడు పాలుపంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవెంట్ ఆఫ్ ఇండియా(సిమీ)లో టాప్ కమాండర్‌గా పనిచేసిన ఖురేషి కొంతమంది ఉగ్రవాదులతో ఇండియన్ ముజాహిద్దీన్ను నెలకొల్పాడు. ఆ తరువాత దేశంలో జరిగిన పలు పేలుళ్లలో ఖురేషి భాగం పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడి ఆచూకీని కనిపెట్టిన వారికి ఎన్‌ఐఏ పెద్ద ఎత్తున రివార్డును ప్రకటించింది. అయితే ఖురేషి మహారాష్ట్రకు చెందిన వ్యక్తి.

Related Posts