YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

హైదరాబాద్ లో క్రైమ్ పెరిగింది బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్

హైదరాబాద్ లో క్రైమ్ పెరిగింది బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్

హైదరాబాద్ జూలై 9, 
హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ బుధవారం చేసిన ప్రకటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. రాజా సింగ్ మాట్లాడుతూ కమిషనర్ అంజనీకుమార్ ని ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఆరు నెలల్లో క్రైమ్ రేట్ బాగా తగ్గిందని చెప్పారు. హైదరాబాద్ లో 20 రోజుల్లో ఆరు మర్డర్లు జరిగాయి, దొంగతనాలు దోపిడీలు, అత్యాచారాలు, ఎన్ని జరిగాయో మీరే చెప్పాలని నిలదీసారు. హైదరాబాద్ లో సరైన రీతిలో క్రైమ్ ని కంట్రోల్ చేయడం లేదు, నడిరోడ్డుపై హత్యలు దొంగతనాలు జరుగుతున్నాయి. హైదరాబాదు లో క్రైమ్ రేటు తగ్గిందని పోలీస్ కమిషనర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఈ స్టేట్ మెంట్ కమిషనర్ ఇస్తున్నాడా ఫామ్ హౌస్ లో ఉన్న మన పెద్దమనిషి ఇప్పిస్తున్నారా చెప్పాలని అయన అన్నారు.

Related Posts