YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్ కనిపించకపోతే వచ్చే నష్టమేంటి? లాక్‌డౌన్‌తో ప్రయోజనం ఉండదు..తలసాని

కేసీఆర్ కనిపించకపోతే వచ్చే నష్టమేంటి?       లాక్‌డౌన్‌తో ప్రయోజనం ఉండదు..తలసాని

హైదరాబాద్ జూలై 9 
విపక్షాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రతిపక్షాలు పనికిరాని చెత్త దద్దమ్మలు అంటూ మండిపడ్డారు. ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ కన్పించకపోతే ప్రతిపక్షాలకు వచ్చే నష్టమేంటి?, సీఎం కన్పించకపోతే పాలన ఆగిందా?, ప్రభుత్వ పథకాలు ఆగాయా?, పరిపాలనలో సచివాలయం ఒక భాగం. కొత్త సచివాలయం కడితే తప్పేంటి?, కేంద్రంలో మంత్రిగా ఉన్న వ్యక్తి తెలంగాణపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడున్నాడు. బీజేపీ నాయకులకు చేతనైతే.. ప్రధానితో మాట్లాడి దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టించాలి. చప్పట్లు కొట్టడం, దీపాలు ఎందుకు  వెలిగించాలని మేము ప్రశ్నించామా?, ప్రైవేట్ ఆస్పత్రులపై ప్రభుత్వానికి నియంత్రణ లేదనటం సరైంది కాదు. ఢిల్లీలో కరోనాను ఎందుకు కట్టడి చేయలేకపోయారో బీజేపీ నేతలు చెప్పాలి. ఎంఐఎంతో కలిస్తే.. కరోనా వచ్చేస్తోందా?, కేంద్రమంత్రి సమాధానం చెప్పాలి. ప్రైవేట్ ఆస్పత్రుల కంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మంచి సదుపాయాలున్నాయి.’’ అని స్పష్టం చేశారు..హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌తో ప్రయోజనం ఉండదని మంత్రి తలసాని అభిప్రాయపడ్డారు. కరోనా వస్తుంది.. పోతుంది.. కాబట్టి ప్రజలే జాగ్రత్తలు తీసుకుంటే కోవిడ్‌ను ఆపగలరని వ్యాఖ్యానించారు. దీనికి మంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, కాంగ్రెస్ నేత వి.హనుమంతురావే ఉదాహరణ అన్నారు. ఫిజికల్ ఫిట్‌నెస్ లేనివారు మాత్రమే కరోనాతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

Related Posts