YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఒంగోలులో విషాదం..గోడ కూలి ముగ్గురు చిన్నారుల మృతి.....!!

ఒంగోలులో విషాదం..గోడ కూలి ముగ్గురు చిన్నారుల మృతి.....!!
ప్రకాశం జిల్లా ఒంగోలులో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న గోడ కూలిన ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. స్థానిక మంగమూరు రోడ్డులోని కొత్తడొంకలో గుడిమెట్ల నవదీప్ (8), కట్టామణి (8), సింధే ప్రేమచంద్ (9), అతని సోదరి సింధే ప్రేమ్ జ్యోతి ఈరోజు పాఠశాలకు వెళ్లి తిరిగి తమ ఇళ్లకు వచ్చారు. కొత్తగా నిర్మించిన ప్రహరీగోడకు అమర్చిన గేటును పట్టుకుని ఆడుకుంటుండగా ఒక్కసారిగా గేటు విరిగి చిన్నారులపై పడింది. దానికి ఆనుకుని వున్న గోడ కూడా కూలిపోవడంతో మిగిలిన వారికి గాయాలయ్యాయి. వెంటనే చుట్టుపక్కల వారు పిల్లల్ని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో మరో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. స్థానికులు వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మణి, ప్రేమ్ చంద్ ప్రాణాలు విడిచారు. ప్రేమ్ జ్యోతికి మెరుగైన చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.. బిడ్డల్ని కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts