YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

తహసీల్దార్ హత్య

తహసీల్దార్ హత్య

బెంగళూరు జూలై 10 
ఇటీవల తహసీల్దార్లపై దాడులు, బెదిరింపులు జరగడం కలకలం రేపోతోంది. తెలంగాణలో గత ఏడాది మహిళా తహసీల్దార్ విజయా రెడ్డి దారుణ హత్య అప్పట్లో సంచలంగా మారింది. మరోసారి చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దు ప్రాంతం కర్ణాటక బంగారు పేటలో తహసీల్దార్ చంద్రమౌళేశ్వర్ (53) పై దాడి జరిగింది.రిటైర్డ్ టీచర్ తహసీల్దార్పై అతి దారుణంగా కత్తితో దాడి చేశారు. కామసముద్రం వద్ద కలవంచి గ్రామంలో భూమి సర్వే చేయడానికి వెళ్లిన తహసీల్దార్పై ఈ దాడి జరిగింది. రెవెన్యూ అధికారులు, పోలీసులు వుండగానే నిందితుడు ఈ దారుణానికి తలపడ్డాడు.  స్కూలు టీచర్ గా పనిచేసి రిటైర్డ్ అయిన వెంకట చలపతి  కత్తితో దాడిచేసి పొడిచారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన తహసీల్దార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు

Related Posts