YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కరోనా భారత్... రికార్డు స్థాయి లో ఒక్క రోజు 26506 పాజిటివ్ కేసులు

కరోనా భారత్... రికార్డు స్థాయి లో ఒక్క రోజు 26506 పాజిటివ్ కేసులు

న్యూ ఢిల్లీ జూలై 10 
రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ మహమ్మారి వైరస్ సరికొత్త రీతిలో విజృంభిస్తోంది. భారత్లో ఆ వైరస్ తీవ్ర స్థాయి లో విజృంభణ కొనసాగుతోంది. తాజాగా 24 గంటల్లో శుక్రవారం దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయి లో 26506 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే 475 మంది వైరస్తో బాధ పడుతూ మృతి చెందారు. ఇప్పటి వరకు మృతి  చెందిన వారి సంఖ్య 21604కు చేరాయి. దేశ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 793802కు చేరింది. వైరస్ బారినపడి ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 276685 మంది చికిత్స పొందుతున్నారు. వైరస్ నుంచి పూర్తిగా కోలుకుని ఇప్పటివరకు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయిన వారి సంఖ్య 495513 మంది. శుక్రవారం నమోదైన కేసులు ఇప్పటి వరకు నమోదైన వాటి లో అత్యధికం. ఇప్పటి వరకు రోజుకు 25 వేలకు పైగా నమోదు కాగా తొలి సారి ఒకేరోజు 26 వే పైన కేసులు నమోదవడం తొలిసారి.ఈ విధంగా దేశంలో రోజు రోజు కు పెద్ద సంఖ్య లో కేసులు పెరుగుతూ మహమ్మారి వైరస్ తీవ్రం గా దాడి చేస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వైరస్ తీవ్రంగా ప్రబలుతోంది. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా వైరస్ను నియంత్రించ లేకపోతున్నాయి. పెద్ద సంఖ్య లో మృతులు సంభవిస్తున్నాయి

Related Posts