YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

మహానంది ఆలయ సిబ్బందిపై కేసు నమోదు

మహానంది ఆలయ సిబ్బందిపై కేసు నమోదు

కర్నూలు జూలై 11, 
కర్నూలు జిల్లా మహానంది దేవస్థానంలో పనిచేస్తున్న ఆరుగురు  ఉద్యోగుల పై కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు మహానంది ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. గత కొన్ని నెలల క్రితం మహానంది దేవస్థానంలో పలు విభాగాల్లో  జరిగిన అవినీతి ఆరోపణలపై కొందరు ఫిర్యాదు మేరకు  కోర్టు ఆదేశాల అనుసారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గత నెలలో పదవీ విరమణ చేసి గురువారం ఉదయం తెల్లవారుజామున మరణించిన మహానంది దేవస్థానం మాజీ ఈవో సుబ్రహ్మణ్యంతో పాటు మహానంది ఆలయంలో పనిచేస్తున్న మరో ఐదుగురిపై కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు మహానంది పోలీసులు  తెలిపారు.ఏవైనా అక్రమాలు జరిగి ఉంటే వెలుగులోకి తీసుకు వస్తామని నంద్యాల సీఐ మల్లికార్జున తెలియజేశారు.

Related Posts