తుర్కపల్లి
టీవీ ఛానళ్లలో రోజు ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను వెలుగులోకి తెస్తూ,వాటి పరిష్కారానికి మార్గాలు అన్వేషిస్తూ,ప్రజలను చైతన్యం చేస్తూ కేసిఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలను ఎలుగెత్తి చాటుతున్న (క్యూ) టీవీ ఛానళ్ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న ను రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని తుర్కపల్లి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేశ్ గౌడ్ అన్నారు మల్లన్న అక్రమ అరెస్టును పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు.ప్రజల సమస్యలను ప్రింటు,ఎలక్ట్రానిక్ మీడియాలు,ప్రజా సంఘాలు,పార్టీలు బట్ట బయలు చేయకుండా ప్రజలకు తెలియవు,పరిష్కారానికి నోచుకోవు.అలాంటిది ఏమీ అనకుండా ఉంటే పరిస్తితి ఏమిటి!ఎవరు మాట్లాడకుండా,విషయాలను,సమస్యలను బయటికి తీయకుండా ఉంటే పరిష్కారం ఎలా దొరుకుతుందని పత్రికలు,మీడియా రెండు ప్రభుత్వానికి,ప్రజలకు మద్య వారధిగా ఉంటుందని అలాంటి మీడియా పై ఆంక్షలు,అరెస్టులు ఉంటే సమాజ అభివృద్ది చతికిల పడుతుందని పేర్కొన్నారు వెంటనే తీన్మార్ మల్లన్న ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు