YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

దక్షిణాయణం అంటే ఏమిటి?*

దక్షిణాయణం అంటే ఏమిటి?*

దక్షిణాయణం అంటే ఏమిటి?*
( 16-07-2020 తేది గురువారం నుండి దక్షిణాయనం ప్రారంభం )
భారతీయ ధర్మం సంవత్సర కాలాన్ని రెండు భాగాలుగా విభజించింది. అవి దక్షిణాయనం. ఉత్త్తరాయణం, దక్షిణాయణాన్ని దేవతలకు రాత్రి సమయంగా పరిగణిస్తారు. ఉత్తరాయణాన్ని దేవతలకు పగటి సమయంగా భావిస్తారు. దక్షిణాయణం దేవతలకు రాత్రి అవడం వల్ల ఆ సమయంలో వారు నిద్రిస్తారని అంటారు. అందుకే విష్ణుమూర్త్తి కూడా శయన ఏకాదశి రోజు నుంచి నిద్రపోతాడని చెబుతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యడు ఈ రోజున కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. అందువల్ల్ల ఈ రోజును కర్కాటక సంక్రాంతిగా పిలుస్తారు.
దక్షిణాయణంలో సూర్యుడు దక్షిణార్థ గోళం దిశగా పయనిస్తాడు. ఇందుకు భిన్నంగా ఉత్తరాయణంలో సూర్యుడు ఉత్తరార్థ గోళం దిశగా పయనిస్తాడు. దక్షిణాయనం సహజంగా జులై మధ్య కాలంలో ప్రారంభమై జనవరి 14 వరకూ కొనసాగుతుంది.
ముఖ్యంగా దక్షిణాయనంలోనే పితృ దేవతలు తమ సంతానం ఇచ్చే విశేష శ్రాద్ధాలు, విశేష తర్పణాలు తీసుకునేం దుకు భూమి పైకి వస్తారని చెబుతారు. ఈ దక్షిణాయనంతోనే పితృదేవతల ఆరాధనకు సంబంధించిన మహళాయ పక్షాలు వస్తాయి. పితృదేవతలను సంతృప్తిపరిస్తే వారి అను గ్రహంతో సంతానాభివృద్ధి వంటివి జరుగుతాయి. శ్రాద్ధాదులు మానివేయడం కూడా సంతానం కలగక పోవడానికి ఒక కారణమని పెద్దలు పేర్కొంటారు. శ్రాద్ధాదులు చేయక పోవడమే పిల్లలు లేక పోవడానికి కారణమని భావించి, వాటిని యధావిధిగా చేయడం మొదలు పెట్టి సంతానం పొం దామని చెప్పినవారు కూడా ఉన్నారు.
బతికుండగా తల్లిదండ్రుల సేవ, మరణించాక శ్రాద్ధాలు చేయడం విధి, ఎంతో ముఖ్యం, శుభప్రదం. పితృ రుణం తీర్చుకోవడానికి అది మార్గం. అంతేకాదు మనను కన్న తల్లిదండ్రులకు అది ఒక కృతజ్ఞతా పూర్వక చర్య. ప్రతి దక్షి ణాయనంలో చలి వంటివి పెరగడం వ్ల్లల ఎక్కువగా మర ణాలు కూడా సంభవిస్తాయి. అయితే ఉత్తరాయణాన్ని పుణ్య కాలంగా భావిస్తారు. ఆ సమయంలో మరణించడం మంచిదనే అభిప్రాయం ఉంది. భీష్ముడు స్వచ్ఛంద మరణం వరంగా ఉన్న వాడు కనుక ఉత్తరాయణం వచ్చే వరకూ వేచి ఉండి అప్పుడు ప్రాణం వదిలాడు.
అయితే దక్షిణాయనంలో కూడా చాలా మంది గొప్ప వారు మరణించారు. అంతమాత్రాన వారికి ఉత్తమ గతులు రావని కాదు. మహాత్ముల విషయంలో వారు ఏ అయనంలో మరణించారన్నది ముఖ్యం కాదని, వారు ఉత్తమ లోకాలు పొందేందుకు దక్షిణాయనం అవరోధం కాబోదని అంటారు. మరణం అనేది మానవుల చేతుల్లో ఉన్నది కాదు. అది దైవ నిర్ణయం. కర్మను బట్టి, వారి ఆయుర్దాయాన్ని బట్టి వారు మానవుల మరణాలు ఉంటాయి. మరో విధంగా చూస్తే కాలం చెడ్డది కాదు. సూర్యగమనాన్ని బట్టి కాలాన్ని ఈ విధంగా విభజించారని చెప్పేవారూ ఉన్నారు. నిజానికి దీక్షలు, పండుగలు వంటివి ఉత్తరాయణంలో కంటె దక్షిణాయనంలో ఎక్కువ.
నాలుగు నెలల దీక్ష అయిన చాతుర్మాస్యం దక్షిణాయనం లోనే వస్తుంది. చాతుర్మాస్యం నాలుగు మాసాలూ కూడా ఈ కాలంలోనే ఉండడం వల్ల ఈ సమయంలో విష్ణు మూర్తి ఆరాధన విశేష ఫలాలు ఇస్తుంది. దక్షిణాయనంలో ముఖ్యంగా చేపట్ట్టవలసిన కార్యక్రమాలు కొన్ని పెద్దలు చెబుతారు.
*వాటిలో కొన్ని ఇవి:*
ధ్యానం, మంత్ర జపాలు చేయడం, సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర నదుల్లో స్నానాలు చేయడం, పిండ ప్రదానాలు, పితృ తర్ఫణాలు వంటివి చేయడం, సాత్వికాహారం (శాకాహారం) తీసుకోవడం, అవసరంలో ఉన్న వారకి దానం చేయడం, అన్నదానం, తిల (నువ్వుల ) దానం, వస్త్ర దానం, విష్ణు పూజ, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, సూర్యరాధన, ఆదిత్య హృదయ పారాయణ ఇటువంటివి చేస్తే అవి శరీరానికి, మనస్సుకు మంచి చేస్తాయి. పాపాలు తొలగిపోతాయి.
*దక్షిణాయనం దేవతలకాలం కాదు కనుక ఈ కాలంలో వివాహాలు గృహప్రవేశాలు చేయడం మంచిది కాదు అని అనుకుంటూ ఉంటారు. అదే కేవలం అపోహ మాత్రమే.*

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts