YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం విదేశీయం

రిలయన్స్ లోకి గూగుల్..

రిలయన్స్ లోకి గూగుల్..

ముంబై, జూలై 16,
రిలయన్స్ జియోలోకి ఇన్వెస్ట్‌మెంట్ల వరద కొనసాగుతోంది. ఫేస్‌బుక్ తర్వాత ఇప్పుడు మరో దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 7.7 శాతం వాటా కొనుగోలు చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ డీల్ విలువ రూ.33,733 కోట్లు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ విషయం వెల్లడైంది.‘జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి గూగుల్‌ను వ్యూహాత్మక ఇన్వెస్టర్‌గా ఆహ్వానిస్తున్నాం. ఇరు కంపెనీల మధ్య భాగస్వామ్యం కుదిరింది. ఇన్వెస్ట్‌మెంట్ అగ్రిమెంట్ ఏర్పరచుకున్నాం. గూగుల్ రూ.33,737 కోట్లు ఇన్వెస్ట్ చేస్తోంది. జియో ప్లాట్‌ఫామ్‌లో 7.7 శాతం వాటా కొనుగోలు చేయనుంది’ అని ఆర్‌ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు.జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి ప్రముఖ టెక్నాలజీ, ఫైనాన్షియల్ ఇన్వెస్టర్లు నుంచి పెట్టుబడులు వచ్చాయి. సిల్వర్ లేక్, విస్తా ఈక్విటీ పార్ట్‌నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, టీపీజీ వంటి సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. బెస్ట్ టెక్ కంపెనీలు, గ్రోత్ ఎంటర్‌ప్రైజెస్‌లలో ఈ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాయి’ అని అంబానీ వివరించారు.దేశంలోనే అతిపెద్ద రైట్స్ ఇష్యూ పూర్తయ్యిందని ముకేశ్ అంబానీ తెలిపారు. ఇష్యూ 1.59 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యిందని పేర్కొన్నారు. లాక్ డౌన్ కాలంలో ఇది పూర్తి కావడం గమనార్హమని తెలిపారు. బ్రిటిష్ పెట్రోలియం కంపెనీ కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో 1 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుందనే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఆర్ఐఎల్ రుణ రహిత కంపెనీగా అవతరించిందని మరోసారి స్పష్టం చేశారు.

Related Posts