YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

కాలువలో తండ్రీ పిల్లల మృతదేహాలు..

కాలువలో తండ్రీ పిల్లల మృతదేహాలు..

రాజమండ్రి జూలై 17, 
తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తితో పాటు అతడి ఇద్దరు పిల్లల మృతదేహాలు కాలువలో లభ్యమయ్యాయి. వారు ఆత్మహత్య చేసుకున్నారా.. లేక ప్రమాదవశాత్తూ చనిపోయారా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. వివరాల్లోకి వెళ్తే.. కోరుకొండ మండలం గాదరాడ దగ్గర  శ్రీనివాస్ తన ఇద్దరు పిల్లలతో కాలువకు వెళ్లాడు. దారిలో  కొందరు గ్రామస్థులకు అనుమానం రావడంతో ఎక్కడికి వెళ్తున్నారని ఆరా తీశారు. ఇంట్లో ఓ కార్యం జరిగిందని.. కాలువలో స్నానం చేయడానికి వెళుతున్నామని చెప్పాడు  కొద్దిసేపటికే  శ్రీనుతో పాటు ఇద్దరు పిల్లల మృతదేహాలు నదిలో తేలియాడుతూ కనిపించాయి. తొలుత తండ్రీ కొడుకుల మృతదేహాలను బయటకు తీశారు. బాలిక మృతదేహం వేరుగా దొరికింది. తండ్రి నడుముకు తాడు కట్టి ఉండటాన్ని బట్టి… పిల్లలు లోతులోకి వెళ్లకుండా ఆ తాడుతో కట్టి కాలువలోకి దిగినట్లు గ్రామస్థులు అనుమానిస్తున్నారు. కాలువలో దిగిన సమయంలో నీటి ప్రవాహం పెరగడం లేదా..ఏదైనా గుంతలోకి జారిపోవడంతో..కాపాడే క్రమంలో ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Related Posts