YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎలాంటి వివక్షత లేదు

ఎలాంటి వివక్షత లేదు

విశాఖపట్నం జూలై 17, 
ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధిలో ఎలాంటి వివక్షత చూపించలేదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. 13 నెలల కాలంలో మంత్రుల, ఎమ్మెల్యేలపై ఎలాంటి అవినీతికి తావు లేకుండా పని చేస్తున్నామని చెప్పారు. అవినీతి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దోషులు ఎంత పెద్దవారైనా వదిలేది లేదని అన్నారు.గత ప్రభుత్వంలో ఇసుక,మద్యంలో అడ్డగోలుగా దోచుకున్నారని అవినీతి చేసిన వారిపై కులము,మతము అంటకట్టడం సరైనదికాదని అన్నారు.భీమిలిలో జరిగిన భూ కుంభకోణాలపై ఆధారాలతో సహా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అందించినట్లు తెలిపారు.తర్వాతే ముఖ్యమంత్రి సిట్ కు ఆదేశిం చారని అన్నారు.సిట్ తన పని తాను చేస్తుందని చట్టం ముందు అందురే సమానులే అని అన్నారు. దేవాలయాల విషయంలో టిడిపి రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.ప్రతి చిన్న విషయాన్ని రాజధాని అంశంపై ముడి పెడతున్నారని అన్నారు.

Related Posts