YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

తల్లిని చంపిన తనయుడు

తల్లిని చంపిన తనయుడు

గుంటూరు జూలై 20 
గుంటూరు జిల్లా మాచర్లలో దారుణ సంఘటన జరిగింది.  మద్యం మత్తులో కొడుకు తల్లిని గొంతుకోసి చంపివేసాడు. వివరాలు ఇలా వున్నాయి.  పట్టణం లో 5వ వర్డ్  సుద్ద గుంతల 1వ లైన్ లో గండ్రకోట లీలావతి(76) నివాసం ఉంటుంది. ఆమె కుమారుడు రామకృష్ణ హైదరాబాద్ లో ఉంటున్నాడు. వయసు మీద పడడంతో లీలావతి కి పనిమనిషి తో సేవలు చేయిస్తున్నాడు.  ఈ మధ్య లీలావతి ఇంటి చుట్టూ కరోనా పాజిటివ్ కేసులు ఉండటంతో పని మనిసి  కొద్దీ రోజులు గా రావడం లేదు. దాంతో రామకృష్ణ ఇంటికి వచ్చి తల్లికి సేవలు చేస్తున్నాడు. అయితే,  సేవలు చేయలేక సోమవారం తెల్లవారు జామున మద్యం సేవించి తల్లి గొంతు కోసి చంపాడు. సమాచాం అందుకున్న పోలీసులు  ఘటన స్థలానికి వచ్చారు. అయితే, ఆ ఇంటి చుట్ట్ఊ కరోనా పాజిటీవ్ కేసులు అధికంగా వుండడంతో పోలీసులు, ఇతర అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

Related Posts