YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాజా గృహం పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

రాజా గృహం పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

కమాన్ పూర్ జూలై 20 
ముంబాయి నగరంలోని అంబేద్కర్ నివాసమైన రాజా గృహం పై దాడి చేసిన వారిని శిక్షించడంలో ప్రభుత్వాలు పూర్తిగా పూర్తిగా విఫలమయ్యాయని మాదిగ యువసేన జాతీయ కోఆర్డినేటర్ మంథని సామేలు మాదిగ ఆరోపించారు. సోమవారం కాన్పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ మరియు  మహా మహానాడు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి ఇ మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సామ్యూల్ మాట్లాడుతూ దారి చూపిన దేవుడైన అంబేద్కర్ ఇంటి పైనే దాడి చేయడం హేయమైన చర్యని అన్నారు. దుండగులను శిక్షించడంలో కేంద్ర మహారాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. కేంద్ర మరియు మహారాష్ట్ర ప్రభుత్వాలకు రానున్న రోజుల్లో మాదిగలు మాలలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. దుండగులను పట్టుకొని శిక్షించే వరకు మా పోరాటం ఆగదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో లో మట్ట రాజయ్య అంబాల రాజేందర్ ర్ ర్ మంథని చందు ఈదునురి వెంకటేశం చాట్ల రాయమల్లు ఎల్లయ్య రాజమల్లు చంద్రయ్య కనకయ్య వీరయ్య ఆదినారాయణ కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Related Posts