హైదరాబాద్ జూలై 20
సచివాలయ కూల్చివేత - పర్యావరణ ప్రభావంపై ఎంపీ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ సోమవారం విచారించింది. కూల్చివేత వల్ల పర్యావరణ ప్రభావం, వ్యర్థాల నిర్వహణ పై అధ్యయనానికి కమిటీని నియమించింది. విచారణ జరిపి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఎన్జీటీ ఆదేశించింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఐఐటీ హైదరాబాద్, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలతో కమిటీకి ఎన్జీటి ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎన్జీటీ ఆదేశిస్తూ...తదుపరి విచారణకు సెప్టెంబర్ 25కు వాయిదా వేసింది.