YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నెలాఖరు కల్లా బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల భర్తీ పూర్తి : సిఎం జగన్..

నెలాఖరు కల్లా బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల భర్తీ పూర్తి : సిఎం జగన్..

అమరావతి జూలై 20 
ఈ నెలాఖరు కల్లా బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల భర్తీ పూర్తవుతుందని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం నాడు కొత్త బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుపై సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సమావేశానికి డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మంత్రులు మోపిదేవి వెంకటరమణ, ధర్మాన కృష్ణదాస్, ఎం.శంకరనారాయణ, బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు వేణుగోపాల కృష్ణ, పొన్నాడ సతీష్, విడదల రజని, జోగి రమేష్, పి.ఉమాశంకర్‌ గణేష్, అదీప్‌ రాజు, బుర్రా మధుసూదన్‌ యాదవ్, గొర్లె కిరణ్‌కుమార్‌తో పాటు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలపై నిశితంగా చర్చించడమే కాకుండా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకెన్నడూ లేని విధంగా బీసీల‌కు 52 కార్పొరేష‌న్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. బీసీల్లోని ఆయా కులాల వారికి ప్రభుత్వ ప్రయోజనాలు అందుతున్నాయా? లేదా? అన్న విషయాన్ని కార్పొరేషన్లు పర్యవేక్షించాలని ఈ సందర్భంగా సీఎం చెప్పుకొచ్చారు. అందరికీ పథకాలు అందేలా చూడటమే కార్పొరేషన్ల చైర్మన్లు ప్రధాన బాధ్యతగా నడుచుకోవాలని సూచించారు.
బీసీల‌కు 52 కార్పొరేష‌న్లు
కాగా.. ఎన్నికలకు ముందు హడావుడిగా 13 కార్పొరేషన్లు పెట్టారని సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు ప్రస్తావనకు తెచ్చారు. వాటిలో కూడా చాలా వరకు ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చారని మరికొందరు ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు. జనాభా, వారి స్థితిగతులను ప్రాతిపదికగా తీసుకుని ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని సమావేశంలో వెల్లడించారు. లోతుగా అధ్యయనం చేసి మొత్తంగా 52 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడమైందని వెల్లడించారు. కనీసం 30–35వేల జనాభా ఉన్న కులానికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేశామని.. ప్రతి కులాన్ని ఏదో ఒక కార్పొరేషన్‌లో చేర్చడం జరిగిందని సీఎంకు నిశితంగా వివరించడం జరిగింది. పది లక్షలకు పైబడి జనాభా ఉన్న కార్పొరేషన్లు–6, లక్షకు పైబడి 10 లక్షల లోపు జనాభా ఉన్న కార్పొరేషన్లు –27, లక్ష లోపు జనాభా ఉన్న కార్పొరేషన్లు 19 ఏర్పాటు. మొత్తంగా 52 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. కార్పొరేషన్ల ద్వారా గతంలో 69 కులాలే పరిగణలోకి తీసుకోగా, ఇప్పుడు మొత్తం 139 కులాలు కూడా కవర్‌ అవుతున్నాయని ఎమ్మెల్యేలు, అధికారులు సీఎంకు నిశితంగా వివరించారు.
సీఎం సలహాలు ఇవీ..
‘అందరికీ ప్రయోజనాలు అందుతున్నాయా? లేదా? అన్న విషయాన్ని కార్పొరేషన్లు పర్యవేక్షణ చేయాలి. ప్రభుత్వ పథకాలు ఆయా వర్గాలకు అందుతున్నాయా? లేదా? అన్నది కూడా పర్యవేక్షించాలి. ఆయా వర్గాల వారికి అవి మార్గదర్శకంగా ఉండాలి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ సెంటర్‌ తీసుకొస్తున్నాం. 18 నెలల్లోగా ఈ స్కిల్‌డెవలప్‌మెంట్‌ కాలేజీలను తీసుకురావడానికి కార్యాచరణ చేపడుతున్నాం. వారి స్కిల్స్‌ను అప్‌గ్రేడ్‌ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. పెద్ద పెద్ద కంపెనీలను ఇందులో భాగస్వామిగా చేశాం. జర్మనీ లాంటి దేశాలకు చెందిన అనేక పెద్ద పెద్ద సంస్థలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. కార్పొరేషన్ల కింద ఉన్న వివిధ వర్గాల వారికి ఈ ప్రయోజనాలు అందేలా చూడాలి. ఎవ్వరూ కూడా మిగిలిపోకుండా అందరికీ నైపుణ్యాభివృద్ధి అందేలా చూడాలి. ప్రతి కార్పొరేషన్‌లోనూ ఒక స్కిల్‌ డెవల్‌మెంట్‌ ప్రతినిధి ఉండేలా చూడాలి. అన్ని కార్పొరేషన్లకూ ఒకే భవనం నిర్మాణం చేయాలి. కార్పొరేషన్‌ ఛైర్మన్ల నియామకం ఈ నెలాఖరు నాటికి పూర్తి కావాలి. ప్రతి కార్పొరేషన్‌లో 7 నుంచి 12 మంది డైరెక్టర్లు ఉండాలి. నెలాఖరులోగా 52 కార్పొరేషన్ల ఛైర్మన్లతో పాటు, బోర్డుల డైరెక్టర్ల నియామకాలు పూర్తి చేయాలి. కులాల అభివృద్ధి కోసం పాటుపడిన వారికి ప్రాధాన్య కల్పించాలని సమావేశంలో నిర్ణయించాం. రూపాయి లంచం లేకుండా, వివక్ష లేకుండా తలుపుతట్టి మరీ పథకాలు అందిస్తున్నాం. నేరుగా నగదు బదిలీ కింద ప్రయోజనం అందించాం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకూ 2,12,40,810 మంది బీసీలకు రూ.22,685.74 కోట్లు వివిధ పథకాల కింద నగదు బదిలీ (డీబీటీ) ద్వారా అందించాం. బీసీల అభ్యున్నతి కోసం ఇంత ఫోకస్‌గా ఎప్పుడూ పని చేయలేదు’ అని సమావేశంలో సీఎం వైఎస్ జగన్ తెలిపారు.

Related Posts