YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

గ్యాంగ్ రేప్ బాధితుల్ని పరామర్శించిన వాసిరెడ్డి పద్మ

గ్యాంగ్ రేప్ బాధితుల్ని పరామర్శించిన వాసిరెడ్డి పద్మ

రాజమండ్రి, జూలై 21,
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని మధురపూడిలో సామూహిక అత్యాచారానికి గురైన బాలికను రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. ఈ సందర్భంగా బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులకు దిశ చట్టం ద్వారా 21 రోజుల్లో శిక్ష పడేలా చూస్తామని వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. సామూహిక అత్యాచారానికి గురైన బాలిక తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది.  దీంతో బాలికను వాసిరెడ్డి పద్మ  పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. బాలిక కుటుంబసభ్యులతో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనలో దోషులను కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు. మహిళల రక్షణకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అనేక చట్టాలు తీసుకొచ్చారని గుర్తు చేశారు.ఇందులో దిశ చట్టం ముఖ్యమైనదని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. ఈ చట్టం కింద దోషులను కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు.

Related Posts