YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్రపతితో రఘరామరాజు భేటీ

రాష్ట్రపతితో రఘరామరాజు భేటీ

న్యూఢిల్లీ, జూలై 21, 
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఢిల్లీలో దూకుడు పెంచారు. కొద్దిరోజలుగా హస్తినలోనే మకాం పెట్టిన ఆయన.. తాజాగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశమయ్యారు.. పలు కీలక అంశాలపై చర్చించారు. రెండు లేఖల్ని రాష్ట్రపతికి సమర్పించినట్లు ఎంపీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే కొనసాగాలని.. వ్యక్తిగత భద్రత విషయంపై విడివిడిగా రెండు లేఖలు అందజేశారు.రాష్ట్రపతితో సమావేశంలో ప్రధానంగా రాజధాని అమరావతి అంశంపైనా చర్చించాను అన్నారు రఘురామ. అమరావతినే రాజధానిగా కొనసాగించి.. అమరావతిని పరిపాలనా రాజధానిగా ఉంచాల్సిందే అన్నారు. ప్రజలంతా అమరావతే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారని.. నెల రోజుల తర్వాత రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను గవర్నర్‌కు పంపించారు. గవర్నర్ కూడా అటార్నీ జనరల్‌తో చర్చించాకే ఏ నిర్ణయమైనా తీసుకోవాలన్నారు.రాజధాని అమరావతితో పాటు తన వ్యక్తిగత భద్రత అంశంపైనా రాష్ట్రపతితో చర్చించానన్నారు ఎంపీ. తన మీద ప్రభుత్వానికి కోపం వచ్చిందని..మంత్రులు, ఎమ్మెల్యేలను ఉసుకోల్పారని.. వారి చేత కేసులు పెట్టించారని మండిపడ్డారు. దిష్టి బొమ్మలు దగ్దం చేశారు. ఇదంతా రాష్ట్రపతికి వివరించాను అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు రాష్ట్రపతికి ముందే తెలిసిని.. తాను చెప్పాలనుకున్న సమాచారం అంతా రాష్ట్రపతి దగ్గర ముందే ఉందన్నారురాష్ట్రపతికి అన్ని విషయాలు ముందుగానే తెలుసన్నారు.

Related Posts