YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఆగని బంగారం, వెండి పరుగులు

ఆగని బంగారం, వెండి పరుగులు

ముంబై, జూలై  22, 
పసిడి పరుగులు పెడుతోంది. బంగారం ధర పైపైకి కదిలింది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధర పరుగుల పెట్టిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది.హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.130 పైకి కదిలింది. దీంతో ధర రూ.51,370కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.140 పెరుగుదలతో రూ.47,090కు ఎగసింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.2250 పెరిగింది. దీంతో ధర రూ.55,400కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.16 శాతం పైకి కదిలింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1846 డాలర్లకు ఎగసింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 6.67 శాతం పెరుగుదలతో 22.99 డాలర్లకు చేరింది.దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50 పైకి కదిలింది. రూ.47,900కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.50 పెరుగుదలతో రూ.49,100కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర ఏకంగా రూ.2250 పెరుగుదలతో. రూ.55,400కు చేరింది.ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Related Posts