YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నిమ్మగడ్డ విషయంలో హైకోర్టు ఉత్తర్వును అమలు చేయాలి

నిమ్మగడ్డ విషయంలో హైకోర్టు ఉత్తర్వును అమలు చేయాలి

అమరావతి  జూలై 22 
నిమ్మగడ్డ విషయంలో హైకోర్టు  ఉత్తర్వును అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ ఆదేశాలను స్వాగతిస్తున్నామని మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఆర్టికల్ 243 కె (2) ప్రకారం భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్డినెన్స్ జారీ చేశారన్నారు. తాజాగా గవర్నర్ ఆదేశాలు జగన్ ప్రభుత్వానికి, ఆయన న్యాయ విభాగానికి గట్టి దెబ్బ అని యనమల పేర్కొన్నారు. దీనికి బాధ్యతగా ప్రభుత్వాన్ని ఎవరు అయితే తప్పుదారి పట్టించారో వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇకనైనా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలన్నారు. నిమ్మగడ్డ చైర్‌లో కూర్చోడానికి కావలిసిన మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే కల్పించాలన్నారు. నిమ్మగడ్డకు ఇప్పటికీ అడ్డంకులు సృష్టిస్తే రాజ్యాంగ సంక్షోభంలోకి పడ్డట్టేనని యనమల పేర్కొన్నారు.

Related Posts