YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాజ్యం శాశ్వతం- ప్రభుత్వం శాశ్వతం కాదు: హైకోర్టు

రాజ్యం శాశ్వతం- ప్రభుత్వం శాశ్వతం కాదు: హైకోర్టు

అమరావతి జూలై 22   
 ప్రభుత్వ ఆస్తులు అమ్మకాల(మిషన్ బిల్డ్ ఏపీ)పై సోషల్ యాక్టివిస్ట్, జర్నలిస్ట్ తోట సురేష్‌ బాబు దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యం వేరు, ప్రభుత్వం వేరని హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యం శాశ్వతమని, ప్రభుత్వం శాశ్వతం కాదని పేర్కొంది. పిటిషనర్ తరపున నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించగా...ప్రభుత్వం తరుపున స్పెషల్ జీపీ వాదనలు వినిపించారు. ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలపై ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు  చేసింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఆస్తులు అమ్మే అంశంలో ప్రభుత్వానికి అసలు ఆధారిటి ఎంత వరకు ఉందో ధర్మాసనం పరిశీలించనుంది.

Related Posts