YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

హత్య కేసులో ఇద్దరి ఆరెస్టు

హత్య కేసులో ఇద్దరి ఆరెస్టు

విశాఖపట్నం జూలై 22  
విశాఖలో కలకలం రేపిన హత్య కేసును పోలీసులు చేధించారు.  ఈ నెల 12న గణేష్ అనే వ్యక్తి హత్య జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు జోగారావు, గుంటు స్వాతిలను ఇద్దర్నీ అరెష్టు చేసినట్లు సీపీ ఆర్కేమీనా తెలిపారు.గణేష్ ను హత్య చేసి గుర్తు తెలియకుండా ఉండేలా గుడివాడ అప్పన్న కాలనీ చేపల కాలువలో పడేసినట్లు అయన చెప్పారు. అయితే ఘటన స్థలం వద్ద నిందితులకు సంబంధించిన ఆధారాలతో వీళ్లను అరెష్టు చేసినట్లు చెప్పారు. స్వాతితో అసభ్యంగా ప్రవర్తించిన గణేష్ ను పధకం ప్రకారం హత్య చేసినట్లు చెప్పారు. చివరికి నిందితులను చాకచక్యంగా అరెష్టు చేశామని సీపీ తెలిపారు.

Related Posts