YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

శిరోముండనం సంఘటనపై ముఖ్యమంత్రి జగన్ క్షమాపణ చెప్పాలి టిడిపి డిమాండ్

శిరోముండనం సంఘటనపై ముఖ్యమంత్రి జగన్ క్షమాపణ చెప్పాలి                    టిడిపి డిమాండ్

రాజమండ్రి జూలై 22  
శిరోముండనం సంఘటనపై ముఖ్యమంత్రి జగన్ క్షమాపణ చెప్పాలని టిడిపి డిమాండ్ చేసింది. బుధవారం తూర్పుగోదావరి జిల్లా సీతానగర్‌లో శిరోముండనం బాధితుడు ప్రసాద్‌ను టీడీపీ నేతలు పరామర్శించారు.ఈ సందర్బంగా మాజీ ఎంపీ గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ దళితుల ఐక్యమత్యాన్ని పోరాటం రూపంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి చూపిస్తామని హెచ్చరించారు. శిరోముండనం బాధితుడికి టీడీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జవహర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మౌనం వీడాలని అన్నారు. దళితులపై వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు దాడులు చేస్తున్నారని మరో నేత, మాజీ మంత్రి పీతల సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. శిరోముండనం అమానుషమన్నారు. టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ...ముఖ్యమంత్రి జగన్ దళితులతో పబ్జీ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. శిరోముండనం సంఘటనపై భాద్యత వహించి హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అత్యాచారానికి గురైన దళిత బాలికపై లోతైన దర్యాప్తు ఏమైందని అనిత ప్రశ్నించారు.

Related Posts