YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పేదల ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి: కన్నా

పేదల ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి: కన్నా

గుంటూరు జూలై 22  
పేదల ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు దేశంలో ప్రతి ఒక్కరికీ సొంత ఇళ్లు ఉండాలని ప్రధాని మోదీ ఆశయమని తెలిపారు. ఆ మేరకు ఏపీకి భారీగా ఇళ్లు మంజూరు చేశారన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే లక్షల ఇళ్లు కేంద్ర సాయంతో నిర్మించారని...పేదల ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని, అప్పట్లో టీడీపీ అవినీతిని ప్రశ్నించిన జగన్...తాను అధికారంలోకి వచ్చాక ఇళ్ల విషయం మర్చిపోయారని మండిపడ్డారు. నిర్మాణాలు పూర్తయిన లక్ష గృహాలను వెంటనే పేదలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న 2.30 లక్షల గృహాల నిర్మాణాలు పూర్తిచేసి  పేదలకు కేటాయించాలని అన్నారు. చాలామంది లబ్ధిదారులు తమ వాటా డబ్బు చెల్లించేందుకు అప్పులు చేశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 4 వేల కోట్ల రూపాయలు తమ వాటా క్రింద గృహ నిర్మాణం కోసం ఇచ్చిందని కన్నా పేర్కొన్నారు. గృహ నిర్మాణంలో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల స్థలాల పేరిట అధికార పార్టీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. నెల్లూరు కలెక్టర్ శేషగిరిరావు వైసీపీ ఎమ్మెల్యేల మాట వినలేదని బదిలీ చేశారని అన్నారు. భూ అక్రమాల్లో నేరుగా ముఖ్యమంత్రి హస్తం ఉందని తాము ఆరోపిస్తున్నామన్నారు. పేద ప్రజల పొట్ట గొట్టడంలో టీడీపీ, వైసీపీ మధ్య ఏ మాత్రం తేడాలు లేవని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంలో అవినీతికి పాల్పడితే... ఈ ప్రభుత్వం ఇళ్ల స్థలాల పేరిట అవినీతి చేస్తోందని కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Posts