YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

తల్లితో సహా కూతురు పై గ్యాంగ్ రేపు

తల్లితో సహా కూతురు పై గ్యాంగ్ రేపు

హైదరాబాద్ జూలై 22  
హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. మత్తు మందు ఇచ్చి ఓ మహిళతో పాటు ఆమె కూతురిపై గ్యాంగ్ రేప్కు పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. ఈ సంఘటన సైబరాబాద్ కమిషనరేట్ లోని  చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళితే.. ఓ 35 ఏళ్ల మహిళ తన కూతురు,కుమారుడితో శేరిలింగంపల్లి లోని పాపిరెడ్డి  రెడ్డి కాలనీ సంధయ్య నగర్ కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటుంది. అయితే ఇంటి యజమాని కన్ను.. ఆమెపై పడింది. దీంతో ఆమెను లోబరుచుకునేందుకు కన్నింగ్ ప్లాన్ వేశాడు. ఆ మహిళ తినే ఆహారంలో మత్తు మంది కలిపాడు. దీంతో విషయం తెలియక ఆ ఆహారాన్ని తీసుకున్న వారు మత్తులో పడిపోయారు. దీంతో సదరు ఇంటి యజమాని.. అతడి స్నేహితులతో కలిసి.. ఆ మహిళపై, ఆమె పదిహేనేళ్ల కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న చందానగర్ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Related Posts