YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

కరోనా వైరస్ నుంచి సురక్షితం 'కోవిడ్ సేఫ్టీ కీ'

కరోనా వైరస్ నుంచి సురక్షితం 'కోవిడ్ సేఫ్టీ కీ'

న్యూ ఢిల్లీ జూలై 22  
బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఎన్నో చోట్ల పరికరాలను తాకాల్సి ఉంటుంది. వీటి వల్ల వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలా అని వీటిని తాకకుండా ఉండలేని స్ధితి. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి ల్యాబ్ క్యూబ్ ముందుకు వచ్చింది. భారత్‌లో కోవిడ్ పరికరాలను తయారుచేసే స్టార్టప్ కంపెనీగా ఉన్న ల్యాబ్ క్యూబ్ తమ ఉత్పత్తులలో భాగంగా కోవిడ్ 19 సేఫ్టీ కీ తయారుచేసింది.కాలిఫోర్నియాలోని సాంస్కృతిక రాయబారి శ్రీనివాస్ ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందడంతో భారతదేశంతో పాటుగా అమెరికాలోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఏ రూపంలో ప్రయోజనాలు ఉన్న ఈ కోవిడ్ సేఫ్టీ కీ పరికరాన్ని ఉత్పత్తి చేశారు. కరోనా వచ్చిన రోగి తాకిన ప్రదేశాలు, ఉపరితలాన్ని ప్రత్యక్షంగా తాకకుండా ఉండేందుకు ఈ కీ ఉపయోగపడుతుంది.ప్రత్యేకమైన ఇత్తడితో దీనిని తయారుచేశారు. వైరస్ సాధారణంగా ఇతర లోహాలపై కన్నా ఇత్తడిపై కొద్దికాలం మాత్రమే బతుకుతుందని శాస్త్రవేత్తలు కూడా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే ! ల్యాబ్‌క్యూబ్ కంపెనీ మేకిన్ ఇండియాలో భాగంగా కొత్తగా తయారుచేసిన 'కోవిడ్ సేఫ్టీ కీ' ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి కిషన్‌రెడ్డి ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్న ఎన్నారై వ్యాపారవేత్త శ్రీనివాస్ మానాప్రగడ, హైదరాబాద్‌కు చెందిన మల్లవరపు ఆరోగ్యరాజు కలిసి తయారుచేసిన కోవిడ్ సేఫ్టీ కీ అందరికీ ఉపయోగపడేలా, కరోనా వైరస్ నుంచి రక్షించేలా ఉందన్నారు. కరోనా వైరస్‌కు దూరంగా ఉండేందుకు అందరూ ఈ కోవిడ్ సేఫ్టీ కీ ని ఉపయోగించాలని సూచించారు.

Related Posts