YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నిమ్మగడ్డ అంశంలో గవర్నర్ స్పందన హర్షం నీయం: రఘురామకృష్ణం రాజు

నిమ్మగడ్డ  అంశంలో గవర్నర్ స్పందన హర్షం నీయం: రఘురామకృష్ణం రాజు

హైదరాబాద్ జూలై 22  
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అంశంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సానుకూలంగా స్పందించడంపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు హర్షం వ్యక్తం చేశారు. ఎస్ఈసీగా రమేశ్ కుమార్‌ను కొనసాగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ చక్కని దిశానిర్దేశం చేశారని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. గవర్నర్ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సవాలు చేయదన్న విశ్వాసం తనకుందని ఆయన వ్యాఖ్యానించారు.  గవర్నర్ ఆదేశాలపై పలు పార్టీల నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పు మేరకు తనను ఎస్ఈసీగా కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తాజా ఆదేశాలు జారీ చేశారు.  

Related Posts