హైదరాబాద్ జూలై 23
నిజామాబాద్ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి గురువారం తన జన్మదినం పురస్కరించుకుని మినిస్టర్ క్వార్టర్స్ లో రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి ఆయనకు పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఆయురారోగ్యాలతో నిరంతరం ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా పోచారం భాస్కర్ రెడ్డి మంత్రి వేముల కు మొక్కను బహుకరించారు.