YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

ఇసుక స్కాంలో మంత్రి కృష్ణారావు : కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్

ఇసుక స్కాంలో మంత్రి కృష్ణారావు : కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్

కేసీఆర్ సర్కార్ లో ఎవరికి తోచిన విధంగా వారు దోపిడీకి లాల్పడుతున్నారు. గాడికింద పండికొక్కుల్లా రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్నారు. మంత్రి జూపల్లి కృష్టారావు అక్రమ  ఇసుక రవాణాకు పాల్పడుతున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఆంద్రప్రదేశ్ లోని ప్రాజెక్ట్ కు ముప్పై కోట్ల విలువైన ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నాడు. కొల్లాపూర్ ఇసుక అక్రమ రవాణా లో జూపల్లి ఉన్నాడు కాబట్టే అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. అక్రమ ఇసుక రవాణా ను అరికట్టడంలో కేటిఆర్ ఫెయిల్ అయ్యాడు. పోలీసు లకు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఫారెస్ట్ ల్యాండ్ లో అక్రమంగా రోడ్డు వేసి .. తిప్పర్ల ద్వారా లాంచీలల్లో లోడ్ చేసి రవాణా చేస్తున్నారని అయన అన్నారు. ఈ అక్రమ ఇసుక రవాణాపై ప్రభుత్వం విచారణ జరిపించాలని అన్నారు. 

Related Posts