YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రైతుల పాలిట వరం తెలంగాణ సర్కార్... *ఎంపీపీ రాచకొండ లక్ష్మీ రవి.

రైతుల పాలిట వరం తెలంగాణ సర్కార్... *ఎంపీపీ రాచకొండ లక్ష్మీ రవి.

కమాన్ పూర్  జూలై 24 
తెలంగాణ రైతుల పాలిట తెలంగాణ సర్కార్ వరంగా మారిందని కమాన్పూర్ ఎంపీపీ రాచకొండ లక్ష్మి రవి అన్నారు. కమాన్పూర్ మండలంలోని నాగారం గ్రామంలో రైతు వేదిక భవనానికి శుక్రవారం ఎంపీపీ రాచకొండ లక్ష్మి రవి సర్పంచ్  ఇతవెన కొమరమ్మ కొమురయ్య భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ లక్ష్మి మాట్లాడుతూ... తెలంగాణలో ప్రతి రైతుకు లాభం చేయు టకు కేసీఆర్ సర్కార్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని ఇందులో భాగంగా రైతు బీమా పథకం రైతు బంధు పథకం 24 గంటల విద్యుత్ సరఫరా సబ్సిడీపై ఎరువులు విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 24 గంటల విద్యుత్ వ్యవసాయ రంగానికి అందించిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. కాలేశ్వరం  సుందిళ్ల అన్నారం బ్యారేజీ నిర్మించి రైతులకు ఉపయోగకరంగా మారేలా చేసిన ఘనత కేసీఆర్ దే అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల రైతు కన్వీనర్ పోనగంటి కనకయ్య టిఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సర్పంచ్ తాటికొండ శంకర్ కో ఆప్షన్ సభ్యుడు ఇంతియాజ్ మాజీ జెడ్పిటిసి మేకల సంపత్ యాదవ్ నాయకులు నాయకులు జాబ్ సతీష్ ఉపేందర్ రావు బంగారు గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Posts