YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కలెక్టర్ చక్రధర్ బాబును కలిసిన జనసేన నేతలు

కలెక్టర్ చక్రధర్ బాబును కలిసిన జనసేన  నేతలు

నెల్లూరు జూలై 24 
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ చక్రధర్ బాబును మర్యాదపూర్వకంగా జనసేన నాయకులు కిషోర్ శుక్రవారం ఆర్ అండ్ బి అతిథి గృహాలు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన జిల్లా ఇన్చార్జి, నెల్లూరు పార్లమెంట్ ఇన్చార్జి మను క్రాంత్ రెడ్డి ఆదేశాల మేరకు, జిల్లా పరిపాలన అధికారి ని కలవడం జరిగింది అన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నిరుపేదలకు ఇంటి స్థలాల పంపిణీ లో భాగంగా ఎస్సీ ఎస్టీల భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని విన్నవించారు. ముందస్తు నోటీసులు జారీ చేయకుండానే దళిత గిరిజనుల పొలాలను దౌర్జన్యంగా లాక్కోవడం అన్యాయం అన్నారు. మద్యం దుకాణాల దగ్గర ఎటువంటి నిబంధనలు పాటించకుండా అధికంగా జనాభా గుమిగూడి మద్యం కొనుగోలు చేస్తున్న సందర్భాలను చూస్తుంటే, కరోనా వైరస్ కు స్వాగతం పలుకుతున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు. గతంలో నెల్లూరు జిల్లా నగర పాలక శాఖ కమిషనర్గా పనిచేసిన అనుభవం ఉన్నందున, నెల్లూరు అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా జనసేన శాఖ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts