YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ రాష్ట్ర బీసీసెల్ కమిటీలో ఐదుగురికి అవకాశం

టీడీపీ రాష్ట్ర బీసీసెల్ కమిటీలో ఐదుగురికి అవకాశం

ఖమ్మం,జూలై 24  
తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కమిటిలో  ఖమ్మం జిల్లా నుంచి ఐదుగురికి స్థానం కల్పించినట్లు తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు  ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ అనుమతితో   బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపతి సతీష్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించినట్టు తెలిపారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఖమ్మం  నియోజకవర్గం నుంచి మీగడ రామారావు, రాష్ట్ర సెక్రెటరీలుగా పాలేరు నియోజకవర్గం నుంచి కనగాల భూషయ్య, నుకా హనుమంతరావు, అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి లగడపాటి రఘు, సత్తుపల్లి నుంచి తిమ్మిడి రాంబాబులను నియమించినట్లు ఆయన తెలిపారు.జిల్లా నుంచి రాష్ట్ర కమిటీలోకి ఎంపికైన  నేతలను తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంట్ పక్షాన నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

Related Posts