YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

మహారాష్ట్రలో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు

మహారాష్ట్రలో పోలీసులు, మావోయిస్టుల మధ్య  కాల్పులు

ముంబై జూలై 24 
మహారాష్ట్రలోని గచ్చిరోలి జిల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య  కాల్పులు చోటుచేసుకున్నాయి. గురువారం సాయంత్రం జిల్లాలోని కొర్చి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు శుక్రవారం ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారని ఆయన తెలిపారు. కొద్దిసేపు ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగిన తర్వాత నక్సల్స్ అడవుల్లోకి పరారైనట్టు సదరు అధికారి పేర్కొన్నారు.అయితే ఈ కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదని చెప్పారు. కాగా జిల్లాలోని పరిసర ప్రాంతాల్లో నక్సలైట్ ఉద్యమ రూపకర్త చారుమజుందార్ జ్ఞాపకార్థం ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు ‘‘అమరవీరుల వారం’’గా పాటించాలంటూ నక్సలైట్లు పోస్టర్లు అంటించినట్లు సమాచారం.

Related Posts