YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

దేశానికి పొంచి ఉన్న ముప్పుల గురించి తాను ముందే హెచ్చరించా! కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ

దేశానికి పొంచి ఉన్న ముప్పుల గురించి తాను ముందే హెచ్చరించా!  కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ జూలై 25,
 దేశానికి పొంచి ఉన్న ముప్పుల గురించి కేంద్ర ప్రభుత్వానికి తాను ముందే హెచ్చరించానని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ అన్నారు. అయితే ప్రభుత్వం తన హెచ్చరికలను పెడ చెవిన పెట్టిందని ఆయన విమర్శించారు. తాను ముందు ఊహించనట్లుగానే దేశంలో పరిస్థితులు మారిపోయానని అన్నారు. ఈ విషయమై తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.‘‘కోవిడ్-19, ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వాన్ని నేను ముందే హెచ్చరించాను. కానీ నా హెచ్చరికల్ని వారు చెత్త బుట్టలో వేశారు. చివరికీ నేను చెప్పిందే జరిగింది. దేశంలో కరోనా వైరస్ కొన్ని లక్షల మందిని చుట్టేసింది. దానితో పాటే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా అత్యంత పతనావస్థలోకి పడిపోయింది. అంతే కాదు, చైనా విషయంలో కూడా నేను ముందస్తు హెచ్చరికలు చేశారు. ఆ హెచ్చరికల్ని కూడా చెత్త బుట్టలో వేశారు’’ అని రాహుల్ గాంధీ రాసుకొచ్చారు.

Related Posts